‘రాక్షసుడు’ చిత్రంతో పెద్ద సక్సెస్ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఈ థ్రిల్లర్ మూవీ తరువాత ఈ యంగ్ హీరో ప్లానింగ్ పెద్ద స్థాయిలోనే ఉంది. ఈసారి ప్రేక్షకులకు మాస్ ఎంటర్టైనర్ని అందించాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్తో కలిసి ‘అల్లుడు అదుర్స్’ అనే మూవీ చేస్తున్నాడు. నూతన నిర్మాత సుబ్రహ్మణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఏడు నెలల విరామం తరువాత ఇటీవలే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ పునః ప్రారంభమైంది. నభా నటేష్,- అను ఇమ్మానుయల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్లో పాల్గొనడం కోసం ముంబయ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు సొను సూద్. ఇందులో ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సోమవారం ఈ మూవీ సెట్లో ఆయన సందడి చేశాడు. లాక్ డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా సొనూ హీరో అనిపించుకున్న విషయం తెలిసిందే. ఇక సోమవారం నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్,- ప్రకాష్ రాజ్, నభా నటేష్-, బ్రహ్మాజీ-, శ్రీనివాసరెడ్డి-, – కాదంబరి కిరణ్, – చమ్మక్ చంద్ర,- దువ్వాసి మోహన్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. త్వరలో టీజర్ని రిలీజ్ చేసి 2021 సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేయాలని ప్లాన్ చేశారు.