Friday, April 26, 2024

మే 1నుంచి అమెజాన్ కొత్త పాలసీ

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మే1 నుంచి కొత్త విధానాన్ని అమలు చేయనుంది. సంస్థ ఉద్యోగులు ఇకనుంచి వారానికి మూడురోజులు కార్యాలయం నుంచి పనిచేయాలని ప్రకటించింది. ఈ మేరకు అమెజాన్ సిఇఓ ఆండీ జెస్సీ సంస్థ ఉద్యోగులకు సమాచారం అందించారు.

కొత్త విధానం మే నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు. నగరాల్లోని ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేస్తే సంస్థ వ్యాపారానికి, ఆర్థిక వ్యవస్థలకు ఊతమిచ్చినట్లవుతుందని తన సందేశంలో పేర్కొన్నారు. కాగా స్టార్‌బక్స్, డిస్నీ, వాల్‌మార్ట్ తమ ఉద్యోగులను ఇప్పటికే సంస్థ కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని సూచించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News