Friday, March 29, 2024

అంబానీ, అమితాబ్‌ల ఇళ్లకు బాంబు బెదిరింపు..

- Advertisement -
- Advertisement -

ముంబై : మహానగరం ముంబైలో పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌ల బంగళాలను పేల్చివేస్తామని ఓ బెదిరింపు కాల్ వచ్చింది. నాగ్‌పూర్‌లోని పోలీసు కంట్రోల్ రూంకు ఆగంతకుడు బుధవారం ఫోన్ చేసి అంబానీ, ధర్మేంద్ర, అమితాబ్‌ల ఇళ్లను పేల్చివేస్తానని చెప్పినట్లు వెల్లడైంది.

అయితే ఇది ఆకతాయి పనిగా నిర్థారణ అయింది. వీరి నివాసాల వద్ద భారీ బందోబస్తు ఉండగా, పరిసరాలలో నిఘాను పెంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News