మనతెలంగాణ/హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ అక్టోబర్ / నవంబర్ నెలలో నిర్వహించిన డిగ్రీ ఐదవ,ఆరవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడదలయ్యాయి. ఈ మేరకు మంగళవారం వర్సిటీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఫలితాలు విశ్వవిద్యాలయ వెబ్సైట్: www.braou.ac.in లేదా విశ్వవిద్యాలయ పోర్టల్ : www.braouonline.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఐదవ, ఆరవ సెమిస్టర్ పరీక్షలలో పాసైన్ విద్యార్థులు పిజి కోర్సులలో 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ పొందడానికి అర్హులని స్పష్టం చేశారు. ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకున్న మెమోలతో కూడా అడ్మిషన్ పొందవచ్చని, అయితే పది రోజుల్లో ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఇస్తామని అండర్ టేకింగ్ ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా బి.టెక్, బి.ఫార్మసీ కోర్సులు చదవిన విద్యార్థులు కూడా ఓపెన్ వర్సిటీలో ఎం.ఎ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ సోషియాలజీ, ఇంగ్లీష్, సైకాలజీ, జర్నలిజం తదితర పిజి కోర్సులలో అడ్మిషన్ పొందవచ్చని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు సమీపంలోని అధ్యయన కేంద్రంలో లేదా 7382929570/580/590/600 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.