Thursday, April 25, 2024

రాజమండ్రిలో అమెరికా మేడ్ గన్ స్వాధీనం

- Advertisement -
- Advertisement -

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గురువారం తుపాకీ కలకలం రేపింది. వన్ టౌన్ పోలీసుల తనిఖీల్లో అమెరికా మేడ్ 9ఎమ్ఎమ్ గన్ పట్టుబడింది. గన్ తో బెదిరించి దందాలు చేసేందుకు కొత్తపేట వాసి శ్రీనివాస్ ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే విజయనగరానికి చెందిన స్నేహితుడి నుంచి శ్రీనివాస్ గన్ తెప్పించుకున్నాడు. గన్ ట్రయల్ వేసేందుకు బయటకు వెళ్లిన శ్రీనివాస్ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి గన్, ఏడు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News