Friday, March 29, 2024

రేపు హైదరాబాద్ రానున్న అమిత్ షా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో శనివారం జరిగే ఐపిఎస్‌ల పరేడ్‌లో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి 10:15 గంటలకు నగరానికి చేరుకోనున్నారు. ప్రత్యేక విమా నంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి పోలీస్ అకాడమీకి రోడ్డు మార్గం ద్వారా రాత్రి 10:40 గంటలకు చేరుకొని అక్కడే బస చేయనున్నారు.

ఎల్లుండి ఉదయం 7:50 గంటల నుంచి 10:30 గంటల వరకు పోలీస్ అకాడమీలో నిర్వహించే ఐపిఎస్ పరేడ్‌లో ముఖ్య అతి థిగా పాల్గొననున్నారు. పరేడ్ అనంతరం 11 నుంచి 12 గంటల వరకు అధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు భోజన విరామం అనంతరం నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి 1:20 గంటలకు చేరుకుంటారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:25 గంటలకు అమిత్ షా దిల్లీకి తిరుగు పయనం కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News