Tuesday, April 23, 2024

కాసేపట్లో హైదరాబాద్‌కు అమిత్ షా

- Advertisement -
- Advertisement -

Amit Shah To Visit Hyderabad On Final Day Of Campaign

హైదరాబాద్: బల్దియా గల్లి ఎన్నికల ప్రచారానికి బడా నేతలు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బేగంపేట విమానాశ్రయానికి రానున్నారు. అక్కడి నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయనున్నారు. అనంతరం గ్రేటర్ ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొనున్నారు. ఉదయం 11:45 గంటలకు వారాసిగూడ చౌరస్తా నుంచి సీతాఫల్ మండీ వరకు ఆయన రోడ్ షో ఉంటుంది. మధ్యాహ్నం 1:30గంటలకు నాంపల్లిలోని పార్టీ ఆఫీసుకు వెళ్లి సాయంత్ర నాలుగు గంటలకు బిజెపి నేతలలో భేటీ కానున్నారు. బల్దియా ఎన్నికలు, ప్రజల స్పందన, పోలింగ్ పై చర్చించనున్నారు. సాయంత్రం 5:30గంటలకు అమిత్ షా ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు.

Amit Shah To Visit Hyderabad On Final Day Of Campaign

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News