Friday, March 29, 2024

ఈనెల 28న రాష్ట్రానికి కేంద్రమంత్రి అమిత్ షా రాక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి లోక్‌సభ ప్రవాస్ ప్రచారంలో భాగంగా ఈనెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని 17 లోక్‌సభలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు, మండల, ఇతర స్థాయి కమిటీల నియామకంపై ఆయన సమీక్షించనున్నారు. అలాగే రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో క్లస్టర్ సమావేశాలు జరగనున్నాయి.

పార్టీ లోక్‌సభ ప్రవాస్ ప్రచారంలో అమిత్ షా రెండు క్లస్టర్ సమావేశాల్లో పాల్గొంటారని, ఎన్నికల సన్నాహాలను సంస్థాగతంగా పర్యవేక్షిస్తారని బిజెపి వర్గాలు తెలిపాయి. ఈ ఏడాదిలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నాహానికి సంబంధించి పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం అమిత్ షా చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News