- Advertisement -
ముంబయి: కరోనా వైరస్ పోకడంతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్లు చికిత్సకు బాగా స్పందిస్తున్నారని నానావతి ఆస్పత్రి వర్గాలు మంగళవారం తెలిపాయి. ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు బాగా స్పందిస్తున్నారని, ఇద్దరూ కనీసం వారం రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుదని ఆ వర్గాలు తెలిపాయి. కాగా తాను త్వరగా కోలుకోవాలంటూ పెద్ద ఎత్తున సందేశాలు పంపిస్తున్న అభిమానులకు అమితాబ్ సోమవారం రాత్రి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలా ఉండగా అమితాబ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన తర్వాత వారి బంగళాల్లో పని చేస్తున్న మొత్తం 26 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారని, వారందరికీ నెగెటివ్ వచ్చిందని స్థానిక అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ విశ్వాస్ తెలియజేశారు.
Amitabh and Abhishek responding well to treatment
- Advertisement -