Saturday, April 20, 2024

కోవిడ్ సెంటర్ కోసం అమితాబ్‌ రూ.2 కోట్ల విరాళం

- Advertisement -
- Advertisement -

Amitabh Bachchan contributed 2 Crore For Covid Centre

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా అల్లకల్లోలం చేస్తున్న వేళ ఎంతో మంది ప్రముఖులు తమ వంతు సాయంగా విరాళాలు ఇస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్ బచ్చన్‌ కరోనా రోగులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. ఢిల్లీలోని రాకబ్ గంజ్‌ ప్రాంతంలోని గురుద్వారా ఆధ్వర్యంలో ఏర్పడనున్న కోవిడ్-19 సంరక్షణా కేంద్రానికి రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు మజిందర్ సింగ్‌ మీడియాకు తెలిపారు. రాకబ్ గంజ్‌లో ఏర్పాటు చేసిన కొత్త కరోనా సంరక్షణ కేంద్రం నేడు ప్రారంభం కానుంది. ఇందులో మొత్తం 300 పడకలను ఏర్పాటు చేసినట్టు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ తెలిపింది.

Amitabh Bachchan contributed 2 Crore For Covid Centre

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News