Thursday, April 25, 2024

ఢిల్లీ గురుద్వారా కొవిడ్ ఆస్పత్రికి అమితాబ్ రూ.2 కోట్ల విరాళం

- Advertisement -
- Advertisement -

Amitabh Bachchan donates Rs 2 crore to Delhi Gurdwara covid Hospital

 

న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్ ఢిల్లీలోని రకబ్‌గంజ్ గురుద్వారాలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్  కోసం రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ కేర్ సెంటర్‌లో ఆరోగ్య సేవల్ని సోమవారం ప్రారంభిస్తామని ఢిల్లీ సిఖ్కు గురుద్వార మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజీందర్‌సింగ్ సీర్సా తెలిపారు. 300 పడకలతో ఏర్పాటైన ఈ కేంద్రంలో పేషెంట్లకు ఉచిత సేవలందిస్తామని ఆయన తెలిపారు. ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటులో జరుగుతున్న పనుల గురించి అమితాబ్ ఎప్పటికపుడు తెలుసుకుంటున్నారని ఆయన అన్నారు. తమకు విరాళం ఇచ్చే సందర్భంగా సిఖ్కులు ఈ దేశానికి చేసిన సేవలకు తాను
నమస్కరిస్తున్నానని అమితాబ్ అన్నారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News