ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తండ్రి అయిన విషయం తెలిసిందే. విరాట్ భార్య అనుష్క శర్మ సోమవారం మధ్యాహ్నం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంపై బాలీవుడ్ షెషాన్ షా అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీటర్ ద్వారా కోహ్లీ అనుష్క శర్మకు అమితాబ్ బచ్చన్ విషెస్ తెలిపారు. అమితాబ్ చేసిన ఆసక్తికరమైన ట్వీట్ వైరల్ అవుతోంది. మన క్రికెటర్లందరికీ కూతుళ్లే పుట్టారంటూ, అంతా కలిసి భవిష్యత్తులో మహిళల క్రికెట్ టీమ్ను తయారు చేస్తోందంటూ అమితాబ్ ట్వీట్ చేశాడు. అందులో వరుసగా ఒక్కొక్కరి పేరు రాసుకుంటూ వెళ్లారు.
ఎంఎస్ ధోనీ కూతురు ఈ మహిళ టీమ్ కు కెప్టెన్ గా ఉంటుందేమో అని కామెంట్ చేశారు. ఆ లిస్ట్లో వరుసగా రైనా, గంభీర్, రోహిత్, షమి, రహానే, జడేజా, పుజారా, సాహా, భజ్జీ, నటరాజన్, ఉమేష్ యాదవ్ల పేర్లు రాస్తూ.. తాజాగా కోహ్లికి కూడా కూతురే పుట్టిందంటూ.. వీళ్లంతా భవిష్యత్తు మహిళల క్రికెట్ టీమ్ను తయారు చేస్తున్నారన్నారు. ఈ ట్వీట్పై కొంతమంది అభిమానులు సూపర్ అని కామెంట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం క్రికెట్లో కూడా వారసత్వాన్ని ఎందుకు తీసుకొస్తున్నారంటూ అమితాబ్ బచ్చన్ పై మండిపడ్డారు.
T 3782 – An input from Ef laksh ~
"… and Dhoni also has daughter .. will she be Captain ? 🙏'' pic.twitter.com/KubpvdOzjt
— Amitabh Bachchan (@SrBachchan) January 13, 2021