హైదరాబాద్: మేడారం జాతర విష్టతను విశ్వవ్యాప్తం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రకటనలను రూపొందించింది. సుప్రసిద్ధ సినీ హీరో అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్తో మేడారం జాతర విశిష్టతను రాష్ట్ర ప్రభుత్వం చాటిచెప్పింది. ఆసియాఖండంలోనే అతిపెద్దగిరిజన జాతరగా ప్రసిద్ధి చేందిన మేడారం గొప్పతనాన్ని, జంపన్నవాగు అంశాన్ని అమితాబ్ వాయిస్ఓవర్లో అద్భతంగా రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది.
సమ్మక్కసారలమ్మ తల్లీకూతురు పేరుతో శతాబ్దాల నుంచి జరుగుతున్న ఈ జాతరకు చరిత్ర ప్రాధాన్యత కూడా ఉంది. తెలంగాణ కుంభమేళంగా ప్రసిద్ధి చెందిన ఈ జాతరకు 10 మిలియన్లకు పైగా భక్తులు వస్తుంటారని ప్రకటనలో తెలిపారు. దేశంలోని అనేక ప్రాతంలనుంచి భక్తులు పాల్గొనే ఈ జాతరను గిరిజన తెగకు చెందిన కోయలు ప్రత్యేకపద్ధతులతో నిర్వహిస్తున్నారని అమితాబ్ వాయిస్లో చెప్పించారు.
Amitabh Voice Over For Medaram Jatara 2020