- Advertisement -
హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. గురువారం జిల్లాలోని మేళ్ల చెరువులో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో స్థానిక ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై 3.0గా భూకంప తీవ్రత నమోదైనట్లు భూ పరిశోధన అధికారులు గుర్తించారు. భూ ప్రకంపనలతో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గానీ జరగలేదని వెల్లడించారు.
An Earthquake of Magnitude 3.0 hits Suryapet
- Advertisement -