- Advertisement -
రంగారెడ్డి: కందుకూరు మండలం నేదునూరులో సోమవారం అర్థరాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది. బాలమణి అనే వృద్ధురాలిని దుండగులు దారుణంగా హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు ఎత్తుకుపోయారు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం హత్య చేసిన నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. నగరశివారుల్లో దొంగల బెడద ఎక్కువ అయిందని గ్రామస్తులు వాపోతున్నారు.
An elderly woman killed in Kandukur Mandal
- Advertisement -