- Advertisement -
మనతెలంగాణ, హైదరాబాద్ : తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….ఈ నెల 12వ తేదీన మైలార్దేవ్పల్లి జామామసీద్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి ఉన్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సమాచారం ఆస్పత్రి వర్గాలు పోలీసులకు చెప్పారు.
- Advertisement -