Friday, April 26, 2024

నీరజ్ చోప్రాకు ఆనంద్ మహింద్రా గిఫ్ట్

- Advertisement -
- Advertisement -

Anand Mahindra gift to Neeraj Chopra

ముంబయి: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి అంతర్జాతీయ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించిన జావలెన్ త్రో వీరుడు నీరజ్ చోప్రాకు ప్రశంసలతో పాటుగా నజరానాలు సైతం వెల్లువెత్తుతున్నాయి. నీరజ్ చోప్రాకు త్వరలో తమ సంస్థ విడుదల చేయనున్న ఎస్‌యువి వాహనం ఎక్స్‌యువి 700ను గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు మహీంద్రాగ్రూపు చైర్మన్ ఆనంద్ మహింద్రా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. టోకో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత అథ్లెట్‌కు ఈ వాహనాన్ని కానుకగా ఇస్తానని ఆనంద్ మహింద్రా గతంలోనే హామీ ఇచ్చాడు. ట్విట్టర్‌లో ఒక ఫాలోవర్ ఈ మేరకు చేసిన సూచనకు వెంటనే స్పందించిన ఆయన ‘నిజానికి చోప్రాకు తమ ఎస్‌యువిని కానుకగా ఇవ్వడం తనకు వ్యక్తిగతంగా లభించిన గౌరవంగా భావిస్తాను’ అని పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News