Friday, April 19, 2024

మాస్ మసాలా సాంగ్‌లో అనసూయ…

- Advertisement -
- Advertisement -

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నూతన దర్శకుడు పెగళ్లపాటి కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన హీరో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ ఫస్ట్ లుక్, టీజర్, ‘మై నేమ్ ఈజ్ రాజు’ సాంగ్ లిరికల్ వీడియో మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ చిత్రాన్ని ఈనెల 19న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ఓ స్పెషల్ డ్యాన్స్ నంబర్‌లో యాంకర్ అనసూయ చిందులేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇందులోని ఓ మాస్ మసాలా ఐటమ్ సాంగ్‌లో స్టెప్పులేసింది అనసూయ. జేక్స్ బిజోయ్ కంపోజ్ చేసిన ఈ పాటను త్వరలోనే విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా ఈ సాంగ్‌లో అనసూయకి సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. ఇందులో అనసూయ చేతిలో డప్పు పట్టుకొని మురిపిస్తోంది.

Anasuya look out from special song chaavu kaburu challaga

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News