Thursday, March 28, 2024

ఎపి ప్రభుత్వానికి హైకోర్టు షాక్

- Advertisement -
- Advertisement -

Andhra Pradesh High Court Stay on Mining Lands

అమరావతి: ఎపి సర్కార్ కు హైకోర్టులో గురువారం మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని మైనింగ్ భూములను ఇతర అవసరాలకు కేటాయించవద్దని కోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం టంగుటూరు మండలంలోని మైనింగ్ భూములను కేటాయించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం పలుచోట్ల మైనింగ్ భూములను కేటాయించారని దాఖలైన పిటిషన్ పై విచారించిన హైకోర్టు దీనిపై స్టే ఇచ్చింది. మైనింగ్ భూములపై కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని వ్యాఖ్యనించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎపి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News