Saturday, April 20, 2024

రామయ్యను దర్శించుకున్న ప్రముఖులు

- Advertisement -
- Advertisement -

Anjani kumar yadav collector visit bhadradri

మన తెలంగాణ / భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని  పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం సూర్యాపేట కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి దంపతులు రామాయంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అనంతరం శ్రీలక్ష్మీతాయారు అమ్మవారు, శ్రీదాసాంజనేయస్వామి వారి ఆలయాలను దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. కలెక్టర్ దంపతులకు దేవస్థానం ఇఒ బి శివాజీ ఆలయలాంఛనాలతో స్వాగతం పలికారు. అర్చకులు ఆశీర్వచనాలు పలికి ఆలయ విశిష్టతను కలెక్టర్ దంపతులకు వివరించారు. అలాగే సికింద్రాబాద్ మాజీ ఎంపి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్‌యాదవ్ శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. భద్రాచలం ఎంఎల్ఎ పొదెం వీరయ్యతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News