Saturday, April 20, 2024

అంగన్‌వాడీ సెంటర్‌లో అన్నప్రాసన

- Advertisement -
- Advertisement -

 

గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్‌లో బుధవారం 6 నెలలు నిండిన పిల్లలకు సర్పంచ్ నవీన్‌ రావు అన్నప్రసాన చేశారు. సర్పంచ్ నవీన్‌రావు పిల్లలకు గుడ్లు, పప్పులు, నూనె అందరికీ అందుతున్నాయ అని తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ వెంకటమ్మ, ఎఎన్‌ఎం పద్మావతి, విజయ, ఆశావర్కర్లు మమత, రాత పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాల్లో పుట్టిన పిల్లల నుంచి మూడు సంవత్సరాల పిల్లల వరకు గుడ్లు, పాలు, బాలమృతం ఇస్తున్నారు. అటు బాలింత తల్లులకు ఆరోగ్యకరమైన భోజనంతో పాటు వారికి పలు సూచనలు చేస్తున్న ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News