Friday, April 26, 2024

కొత్తగా మరో 2,16,165 మందికి టీకా

- Advertisement -
- Advertisement -

Another 216165 new Covid vaccines in Telangana

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 2,16,165 మందికి టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులిటెన్‌లో పేర్కొంది. వీరిలో 1,36,232 మంది మొదటి డోసు తీసుకోగా, 79,933 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 3,01,914 మంది హెల్త్‌కేర్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా 2,13,975 మంది రెండో డోసు తీసుకున్నారు. అదే విధంగా 3,13,392 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొదటి డోసు తీసుకోగా, 1,53,972 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కుల్లో 48,66,834 మంది మొదటి, 2,61,290 మంది రెండో డోసు తీసుకున్నారు. ఇక 45 ఏళ్ల పై బడిన వారిలో 52,79,496 మంది మొదటి, 15,70,617 మంది రెండో డోసు తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,07,61,636 మంది తొలి, 21,99,854 మంది రెండో డోసును పూర్తి చేసుకున్నారు. అయితే అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుంటేనే వైరస్ నియంత్రణ సులువుగా మారుతుందని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News