Wednesday, April 24, 2024

గ్రేటర్‌లో మరి 227 బస్తీ దవాఖానాలు

- Advertisement -
- Advertisement -

basthi-dawakhana

 

ట్విట్టర్ ద్వారా మంత్రి కెటిఆర్ వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జిహెచ్‌ఎంసి) పరిధిలో కొత్తగా మరో 227 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పుర పాలక శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. ఇప్పటికే నిర్వహణలో ఉన్న 123 బస్తీ దవాఖానాలకు తోడు మరో 227 బస్తీ దవాఖానాలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదం తెలిపినట్లు మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో మొత్తం బస్తీ దవాఖానాల సంఖ్య 350కి చేరుతుందన్నారు. రానున్న మూడు నెలల్లో ఈ దవాఖానాలు హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి రానున్నట్లు కెటిఆర్ పేర్కొన్నారు.

Another 227 basthi dawakhanas in Greater
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News