Saturday, April 20, 2024

రామగుండంలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు

- Advertisement -
- Advertisement -

Another ambitious project in Ramagundam NTPC

కాళేశ్వరం ఎత్తిపోతల నీటిపై తేలియాడే సోలార్ పలకలతో 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
ఊపందుకున్న సూపర్ థర్మల్ ప్రాజెక్టు పనులు
సుమారు రూ.10,598 వేల కోట్ల ఖర్చు

హైదరాబాద్ : దక్షిణ భారతదేశానికి విద్యుత్ వెలుగులు పంచుతున్న రామగుండం ఎన్‌టిపిసి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టింది. రెండు నెలల్లోగా 100 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్ పలకలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయబోతోంది. దీనికి సుమారుగా రూ. 424 కోట్ల ను వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌టిపిసి లో ఏడాదిలోగా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. కోవిడ్ 19తో ఆలస్యమైన సూపర్ థర్మల్ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం ఊపందుకున్నాయి. పునర్వివిభజన చట్టం ప్రకారం 4 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండ గా దీనికి అనుగుణంగా ప్లాంట్ల నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు రూ.10వేల 598 కోట్లను ఖర్చు చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 2 టిఎంసీల నీటితో పాటు ఒడిశాలోని మందాకిని కోల్ బ్లాక్ నుంచి బొగ్గు సరఫరా చేసే విధంగా ఇప్పటికే ఎన్టీపీసీ ఒప్పందం కుదుర్చుకుంది.

కరోనా కారణంగా పనుల్లో జాప్యం జరిగిందని ప్రస్తుతం శరవేగంగా పనులు సాగుతున్నాయని ఎన్టీపీసీ అధికారులు తెలిపారు. 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు ప్లాంట్లు రాబోయే ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి రానున్నాయి. మెుదట సాంకేతిక పరిజ్ఞానం మార్పు వల్ల కొంత ఆలస్యంకాగా, అనంతరం కొవిడ్ 19 కారణంగా నాలుగు, ఐదు నెలలపాటు పనుల్లో ఆలస్యం జరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలపై నీటిపై తేలియాడే పలకలతో విద్యుత్ ఉత్పత్తిని చేసే అంశాన్ని ఇప్పటికే ఎన్టీపీసీ అధికారులు పరిశీలించను న్నారు. జలాశయం వద్ద దాదాపు 450 ఎకరాల్లో 5 లక్షల సౌర ఫలకాలను బిగిస్తున్నారు. థర్మల్ పవర్ కంటే ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.

ప్రయోగాలకు ఎన్‌టిపిసి పెద్దపీట

మరోవైపు ప్రయోగాత్మకంగా చేపట్టిన సిమెంట్ రహిత రహదారి నిర్మాణాన్ని ఎన్టీపీసీ విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు 4కోట్లతో కిలో మీటర్ మేర పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. సిమెంట్ రహిత నిర్మాణంలో బూడిదతో పాటు సోడియం సిలికెట్, సోడియం హైడ్రాక్సైడ్ ఇందులో కలుపుతారని, ఇలాంటి రహదారులు పర్యావరణానికి ఎంతో దోహదం చేస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. జియోపాలిమర్ రహదారి నిర్మాణంలో 90 శాతం బూడిదను ఉపయోగిస్తున్నారు. దీనికి సిమెంట్, ఇతర మిశ్రమాలు అవసరం లేదు. ఇలాంటి మిశ్రమాలను తయారు చేయడానికి కొండలను మైనింగ్ చేసి ధ్వంసం చేస్తున్నారు. ఒకసారి బూడిదను ఉపయోగించి మిశ్రమాలు రూపొందిస్తే సహజవనరులు సురక్షితంగా ఉంటాయని, విద్యుత్ ఉత్పత్తిలో ఇలాంటి ప్రయోగాలను చేపడుతూనే పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని ఎన్టీపీసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News