- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : తీన్మార్ మల్లన్నపై జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఈ మేరకు మల్లనను జగద్గిరిగుట్ట పోలీసులు వర్చువల్గా విచారించారు. మల్లన్నపై సంపత్ రెడ్డి అనే వ్యక్తి గతంలో ఫిర్యాదు చేశారు. మల్లన్న తన ఫోన్ నంబర్ను మీడియాలో స్క్రీన్పై ప్రదర్శించారని సంపత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.మల్లన్నపై గతంలో పలు స్టేషన్లలో కేసులు నమోదు కాగా ఆయన ప్రస్తుతం రిమాండ్లో ఉన్న విషయం విదితమే. ఈ నెల 9వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పీటీ వారెంట్పై మల్లన్నను వర్చువల్గా విచారించినట్లు సిఐ సైదులు మీడియాకు తెలిపారు.
- Advertisement -