Saturday, April 20, 2024

టిక్రీ వద్ద మరో రైతు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Another farmer commits suicide at Tikri

 

న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దు ప్రాంతం టిక్రీలో ఓ రైతు విషపూరితమైన టాబ్లెట్లు తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా పకాస్మా గ్రామానికి చెందిన జైభగవాన్ రానే(42) మంగళవారం సల్ఫాస్ గోళీలు తీసుకోగా ఆయణ్ని ఢిల్లీలోని సంజయ్‌గాంధీ హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందించారు. బుధవారం ఆయన మరణించారు. తాను ఓ చిన్న రైతునని, నాలాగే ఎంతోమంది రైతులు కేంద్రం తెచ్చిన చట్టాలకు నిరసనగా వీధుల్లో ఆందోళన చేస్తున్నారని రానే తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. గత నెల పంజాబ్‌కు చెందిన ఓ న్యాయవాది కూడా టిక్రీకి కిలోమీటర్ దూరంలో విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News