Friday, March 29, 2024

నేటి నుండి మరో హిలేరియస్ సన్నివేశం

- Advertisement -
- Advertisement -

 Sarileru Neekevvaru

 

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు ఈ సినిమాలో సూపర్‌స్టార్ మహేష్, రావు రమేష్ కుటుంబ సభ్యుల మధ్య వచ్చే ఒక మంచి హిలేరియస్ సన్నివేశాన్ని శనివారం మార్నింగ్ షో నుండి చిత్రంలో జత చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు.

ఇక దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని నిర్మించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతీగా లేడీ అమితాబ్ విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత, బండ్ల గణేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, కిశోర్ గరికిపాటి, రామ్ లక్ష్మణ్, యుగంధర్.టి, ఎస్.కృష్ణ ప్రధాన సాంకేతిక వర్గంగా పనిచేశారు.

Another Hilarious scene in Sarileru Neekevvaru
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News