Thursday, April 18, 2024

భూపాలపల్లి జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : భూపాలపల్లి జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటుకానుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తపల్లి గోరి మండలం ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేస్తూ జిఓ 6ను విడుదల చేసింది. ఎనిమిది గ్రామాలతో ఈ కొత్త మండలాన్ని ప్రతిపాదిస్తున్నట్టు సిఎస్ సోమేష్‌కుమార్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ జిల్లాలో 11 మండలాలు, 241 గ్రామ పంచాయతీలున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాను కరీంనగర్‌లోని ప్రాంతాలు, పూర్వ వరంగల్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి ఈ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ జిల్లాకు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కె.జయశంకర్ పేరు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News