- Advertisement -
రాష్ట్రంలో రెండో కరోనా మరణం
సోమవారం 13 మంది బాధితుల డిశ్చార్జ్
కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనాతో మరో వ్యక్తి (76) మృతి చెందాడు.దీంతో కొవిడ్19తో తెలంగాణలో మృతి చెందిన వ్యక్తుల సంఖ్య రెండుకు చేరుకుంది. అలాగే 13 మంది కరోనా బాధితులు కోలుకుని సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా మరో ఆరు కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ రాత్రి 8 గంటలకు విడుదల చేసిన బులిటెన్లో తెలిపింది. ఇందులో కరీంనగర్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారి కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి పాజిటివ్ ఉండగా, అతని నుంచి వారికి సోకింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 77 కేసులు నమోదు కాగా, రెండు మరణాలు సంభవించగా (ఇందులో ఒకరికి చనిపోయాక పాజిటివ్ వచ్చింది) , 14 మంది డిశ్చార్జ్ కాగా 61 మంది చికిత్స పొందుతున్నారు.
Another person killed with corona in Telangana
- Advertisement -