Friday, March 29, 2024

కన్నా లక్ష్మినారాయణ కోడలు అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఎపి బిజేపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కోడలు గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రిలో గురువారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. కన్నా లక్ష్మినారాయణ కుమారుడు ఫనీంద్రను నల్లపురెడ్డి సుహారికా రెడ్డి ప్రేమ వివాహం చేసుకుంది. సాఫ్టేవేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. గత కొంత కాలం నుంచి ఆమెకు కన్నా కుమారుడికి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న సుహారికా రెడ్డి మాదాపూర్‌లోని మీనాక్షి టవర్స్‌లో ఉంటోంది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ గేటెడ్ కమ్యూనిటీ, విల్లానంబర్ నంబర్ 18లో ఉంటున్న స్నేహితురాలు ఇంటికి వెళ్లిన సుహారికా రెడ్డి అనుమానస్పదస్థితిలో మృతిచెందింది. వెంటనే వారు ఫైనాన్షియల్ జిల్లాలోని ఎఐజి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు స్పష్టం చేశారు. సుహారికా రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

AP BJP President Kanna Laxminarayana Daughter- in- law-died

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News