Friday, March 29, 2024

ఎపిలో కానిస్టేబుల్ దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

AP Constable Murdered in Nandyal

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం అర్థరాత్రి ఓ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు. నంద్యాల పట్ణణ డిఎస్‌పి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న గూడూరు సురేంద్రకుమార్ (37) విధులు ముగించుకొని ఆదివారం రాత్రి ఆఫీసు నుంచి బైక్ ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాజ్ థియేటర్ సమీపంలో ఆరుగురు పాతనేరస్తులు అడ్డగించి అటుగా వస్తున్న ఆటోను ఆపి అందులో ఎక్కించుకుని చిన్నచెరువు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సురేంద్రకుమార్‌ను కత్తులతో పొడిచి హత్యచేసి వెళ్లిపోయారు.దీంతో కొన ఊపిరితో ఉన్న సురేంద్రను ఆటో డ్రైవర్ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విషయం తెలియజేశాడు. అక్కడ నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ మృతదేహాన్ని ఎస్‌పి కె. రఘువీర్‌రెడ్డి పరిశీలించారు. ఈ ఘటనపై మూడో పట్టణ సిఐ మురళీమోహన్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలో కానిస్టేబుల్‌ను దారుణంగా హత్య చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా దాడిలో పాల్గొన్న వారిపై కానిస్టేబుల్ గతంలో నంద్యాల జిల్లా ఎస్‌పికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నంద్యాలలో హత్యకు గురైన కానిస్టేబుల్ సురేంద్ర మృతదేహానికి జిల్లా ఎస్‌పి నివాళులు అర్పించారు. కానిస్టేబుల్ హత్యకు పాల్పడిన దుండగులను త్వరలోనే పట్టుకుంటాని తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, ఎట్టిపరిస్థితుల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

AP Constable Murdered in Nandyal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News