Friday, March 29, 2024

ఎపి మాజీ డిజిపి ప్రసాదరావు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ap former dgp prasada rao passed away

అమరావతి: ఉమ్మడిఆంధ్రప్రదేశ్ మాజీ డిజిపి బయ్యారపు ప్రసాదరావు కన్నుమూశారు. కొన్నాళ్లుగా అమెరికాలో గుండెపోటులో ఆయన తుదిశ్వాస విడిచారు. యుఎస్ లో ఉంటున్న అర్ధరాత్రి ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ప్రసాదరావు ప్రాణాలు వదిలినట్టు కుటుంబీకులు తెలిపారు. ప్రసాదరావుకు భార్య, కుమారుడు, కొడలు ఉన్నారు. 1979వ బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన బి. ప్రసాదరావు వయసు 65 ఏళ్లు. ఆయన స్వస్థలం విజయవాడ. కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్ ఎస్పీగా పనిచేశారు. ఎసిబి డిఐజిగా, హైదరాబాద్, సైబరాబాద్ సిపిగానూ సేవలు అందించారు. ఎపిఎస్ ఆర్టీసి ఎండిగానూ విధులు నిర్వహించారు. 1997లో భారత పోలీసు పతకం, 2006 రాష్ట్రపతి పతకాలను ప్రసాదరావు అందుకున్నారు. ‘వర్డ్ పవర్ టు మైండ్ పవర్’ అనే పుస్తకాన్ని కూడా ఆయన రాశారు.

 

ap former dgp prasada rao passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News