Thursday, April 25, 2024

కరోనాతో ఎపి మాజీ మంత్రి మృతి..

- Advertisement -
- Advertisement -

AP Former Minister Manikyala rao passes away

అమరావతి: కరోనాతో ఎపి మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు(60) కన్నుమూశారు. గత నెల రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 1961లో తాడేపల్లిగూడేంలో మాణిక్యాలరావు జన్మించారు. ఫోటో గ్రాఫర్ గా కేరీర్ ప్రారంభించిన మాణిక్యాలరావు మంత్రిగా ఎదిగారు. తొలిసారిగా తాడేపల్లిగూడెం నుంచి బిజెపి ఎంఎల్ఎగా ఆయన గెలిచారు. తొలి ప్రయత్నంలోనే చంద్రబాబు కేజినేట్ లో మాణిక్యాల రావుకు పదవి లభించింది. టిడిపి హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా మాణిక్యాల రావు పనిచేశారు. 2014నుంచి 2018 వరకు మంత్రిగా పనిచేశారు.

AP Former Minister Manikyala rao passes away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News