- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులకు ప్రభుత్వం తీపికబురు చెప్పనుంది. ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ తర్వాత మద్యం ధరలను భారీగా పెంచేసింది ఎపి సర్కార్. మద్యం మాన్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే దానికి బానిసైన వాళ్లు శానిటైజర్ తాగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరోవైపు పక్కరాష్ట్రాల నుంచి మద్యం అక్కమ రవాణ పెరిగింది. దీంతో ప్రభుత్వం మళ్లీ ధరలపై ఆలోచనలో పడింది. కొత్త మద్యం ధరల విధానంపై సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే చీప్ లిక్కర్ ధరలు తగ్గించి,బ్రాండెడ్ మద్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.
AP government is planning to reduce liquor prices
- Advertisement -