- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 17 వరకూ ఎపి పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈనెల 31 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ఎపి ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రెండు వారాలపాటు వాయిదా వేస్తున్నామని, తర్వాత పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ఎపి విద్యా శాఖమంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 7 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
AP Govt Announces 10th Exams postponed due to Corona
- Advertisement -