Wednesday, April 24, 2024

ఎపిలో నిరుద్యోగులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: త్వరలో డిఎస్‌సి నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. త్వరలో టీచర్లు, ఉద్యోగుల బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. బదిలీల్లో పారదర్శక విధానాన్ని తీసుకొస్తామని, విశాఖ పరిపాలన రాజధాని తమ పాలసీ అని, డైవర్షన్ చేయాల్సిన అవసరం లేదన్నారు. విశాఖ స్టీల్‌పాంట్‌పై కొందరు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని దుయ్యబట్టారు. కేంద్రం ఆధీనంలోనే స్టీల్‌పాంట్ ఉండాలని చెబుతున్నామని, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమన్నారు. విద్యార్థులకు రాగిజావ నిలిపేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పరీక్షలు, ఒంటిపూట బడులు వల్లే చిక్కీలు ఇస్తున్నామన్నారు.

Also Read: పిల్లాడి చేతిలో విరాట్‌పై ప్లకార్డు: నెటిజన్ల ఆగ్రహం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News