- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి రాజధాని భూఆక్రమణలపై సిబిఐ విచారణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భూదందా జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. దాదాపు నాలుగు వేల ఎకరాలను టిడిపి నేతలు రాజధాని ప్రకటనకు ముందే కొనుగోలు చేశారని దీనిపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం కూడా తేల్చింది. దీంతో పాటు కొందరు బినామీ పేర్లమీద తెల్లరేషన్ కార్డుదారులు కూడా భూములు కొనుగోలు చేసినట్లు సిఐడి కనుగొంది. దీనిపై నిజానిజాలను తేల్చడానికి ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది.
AP Govt Orders CBI probe into Amaravati land scam
- Advertisement -