- Advertisement -
అమరావతిః రాష్ట్రంలోని పేదప్రజలకు ఆగస్టు 15న ఇళ్ల పట్టాలివ్వాలని అనుకుంటున్నామని ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం స్పందనపై సిఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల పట్టాలపై టిడిపి నేతలు కోర్టుకు వెళ్లారని, కోవిడ్ మహమ్మారి కారణంగా కేసుల పరిష్కారానికి నోచుకోలేదని సిఎం తెలిపారు. డి-పట్టాల కింద ఇవ్వాలనుకుంటే ఈరోజు కూడా ఇవ్వొచ్చన్నారు. ఏపిలో 20శాతం మంది ప్రజలకు ఇళ్ల స్థలాలిస్తున్నామని, 30 లక్షల మందిని ఇళ్ల యజమానులుగా చేస్తున్నామని సిఎం చెప్పారు. ఇళ్ల పట్టాల కోసం 62 వేల ఎకరాలు సేకరించామని, ప్రైవేట్ భూముల కొనుగోలుకే రూ.7.500 కోట్లు ఖర్చు చేశామని సిఎం జగన్ వివరించారు.
AP Govt postpones house site pattas distribution to Aug 15
- Advertisement -