Wednesday, April 17, 2024

ఆస్పత్రిలో చేరిన స్పీకర్ తమ్మినేని సీతారాం

- Advertisement -
- Advertisement -

AP speaker Tammineni Sitaram admitted in hospital

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్వీకర్ తమ్మినేని సీతారాం మరోసారి దవాఖానలో చేరారు. ఇటీవల ఆయన కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. తమ్మినేని జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేర్పించారు. ప్రస్తుతం తమ్మినేని తాడేపల్లి సమీపంలోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తమ్మినేని, ఆయన భార్య వాణిశ్రీకి కరోనా వైరస్ సోకింది. చికిత్స పొందిన తర్వాత నెగెటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే గత మూడ్రోజులుగా తమ్మినేని సీతారాం జ్వరం రావడంతో, కుటుంబసభ్యులు ఆయనను మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. తమ్మినేని మరోసారి ఆసుపత్రిలో చేరడంపై ఎపి ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. సీతారాం ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

AP speaker Tammineni Sitaram admitted in hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News