హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బారిన పడిన ఐపిఎస్ దంపతులు కరోనాను జయించి తిరిగి శుక్రవారం విధుల్లో చేరారు. దిశా స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్, డిసిపి విక్రాంత్ పాటిల్ దంపతులు ఇటీవల కరో నా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరిన ఐపిఎస్ దంపతులకు డిజిపి గౌతం సవాంగ్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిజిపి మీడియాతో మాట్లడుతూ కోవిడ్ను జయించిన పోలీసు అధికారులు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని పిలుపునిచ్చారు. కరోనా బాధితుల్లో మనోస్థైర్యాన్ని నింపాలని, విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఏ మాత్రం అనుమానం ఉన్న వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణలో కోవిడ్ బారినపడిన పోలీసులు కోలుకొని విధుల్లో రావడం ఆనందంగా ఉందని డిజిపి వ్యాఖ్యానించారు.
Andhra pradesh IPS couple conquered coronavirus