Wednesday, April 24, 2024

నిలకడగా సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

Apollo doctors release Sai Dharam Tej's health bulletin

హైదరాబాద్:  రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ కోలుకున్నాడని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు శనివారం నాడు బులిటెన్ విడుదల చేశాయి. ఆయన స్పృహలోకి వచ్చారని అపోలో ఆస్పత్రి సిబ్బంది ప్రకటించారు. అంతేకాదు తేజుకి వెంటిలేటర్ ను తొలగించినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. అయితే మరికొన్ని రోజుల పాటు సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ లోనే ఉండి చికిత్స తీసుకోవాల్సి ఉందని తెలిపారు. శరీరంలోని ముఖ్య భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని, తనంతట తానే సాయిధరమ్ తేజ్ శ్వాస తీసుకుంటున్నట్లు చెప్పిన డాక్టర్లు తెలిపారు. వినాయక చవితి రోజున బైక్ పై ప్రయాణిస్తూ రోడ్డుమీద ఇసుక ఉండడంతో సాయిధరమ్ తేజ్ అదుపుతప్పి పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాదవశాత్తూ కిందపడిపోయిన సాయిధరమ్ తేజ్‌ని మెడికవర్‌కి మొదట తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం అపోలో ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News