నేడు జిల్లా యువజన క్రీడా కార్యాలయంలో అందజేయాలి : జిల్లా క్రీడా అధికారి
మన తెలంగాణ, హైదరాబాద్ : జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట సేవల అందించిన వారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు, సేవలందించిన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడా అధికారి ఎన్. సుధాకర్ తెలిపారు. శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఎంపికైన అభ్యర్దులకు జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈసందర్భంగా సామాజిక కళలు, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్ అఫైర్స్, సైన్, టెక్నాలజీ ,ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, వైద్యం, లిటరేచర్, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసులు ఇతర రంగాల్లో సాధించిన లక్షాలను చేసిన కృషిని 800 పదాలు మించకుండా ఈనెల 20వ తేదీ సాయంత్రం 5గంటల లోపు జిల్లా అభ్యర్దులు జిల్లా యువజన, క్రీడా అధికారి కార్యాలయం, కలెక్టరేట్ కాంప్లెక్సు, నాంపల్లి స్టేషన్ రోడ్ అబిడ్స్లో 04 సెట్స్ దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ఇతర వివరాల కోసం పద్మఅవార్డు వెబ్సైట్లో చూడాలన్నారు.