- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : సమగ్ర వ్యవసాయ విధానం అమలు కోసం ఖాళీగా ఉన్న క్లస్టర్లలో ఎఇఒల నియామకం మెరిట్ ప్రాతిపదికన కొనసాగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్దతిలో అభ్యర్థుల ఎంపికను కలెక్టర్లు చేపడుతారన్నారు. నిరుద్యోగ అభ్యర్థులు ఈ విషయంలో ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. పోస్టుల నియామకాలలో ఎలాంటి అక్రమాలకు అస్కారం లేదని స్పష్టం చేశారు.
- Advertisement -