- Advertisement -
న్యూఢిల్లీ : 2014 నుంచి దేశంలో 157 కొత్త మెడికల్ కాలేజీలకు ఆమోదం తెలిపినట్టు ఈ ప్రాజెక్టులకు రూ. 17.691.08 కోట్లు వెచ్చించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియచేసింది. దీనివల్ల అదనంగా 16,000 అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు లభిస్తాయని వివరించింది. వీటిలో 6500 సీట్లు కేంద్ర ప్రభుత్వ నిర్వహణ లోని 64 కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అందుబాటు లోకి వచ్చాయని వివరించింది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాల నిర్వహణ లోని కాలేజీల అప్గ్రేడ్ కోసం రూ. 2451.1 కోట్లు వెచ్చించినట్టు పేర్కొంది.
- Advertisement -