- Advertisement -
ముంబై: భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడగా తాజాగా మరో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన ఇస్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ‘ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. డాక్టర్ల సలహా మేరకు హోం ఐసోలేషన్ లో ఉన్నా. నా ఆరోగ్యం గురించింది మీకు సమాచారం అందిస్తూ ఉంటూ’ అని పేర్కొన్నాడు. అయితే ఇప్పటికే బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, లాంటివారు కోవిడ్ బారిన పడి కోలుకున్నారు.
- Advertisement -