Friday, April 19, 2024

శునకాన్ని కాపాడడానికి ప్రయత్నించి ఆర్మీ మేజర్ మృతి..

- Advertisement -
- Advertisement -

 

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకున్న కుక్కను కాపాడడానికి వెళ్లి ఓ ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం బారముల్లా జిల్లాలోని గుల్మార్గ్ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి అధికారుల గుడిసెలో మంటలు చెలరేగాయి. ప్రత్యేక విధులు నిర్వర్తించే దళానికి చెందిన మేజర్ అంకిత్ బుద్రాజా తన భార్యను, అతని కుక్కలలో ఒకదానిని రక్షించారు. మంటల్లో చిక్కుకున్న మరో కుక్కను రక్షించేందుకు ప్రయత్నించిన మేజర్ ఆ మంటల్లో చిక్కుకొని దాదాపు 90 శాతం కాలిపోయాడు. దీంతో ఘటనాస్థలంలోనే మేజర్ అంకిత్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని శవ పరీక్షల కోసం తంగ్ మార్గ్ ఆస్పత్రికి తరలించారు.

Army major dies trying to save his dog from fire 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News