Friday, April 19, 2024

ఎటిఎంలో చోరీకి యత్నించిన దొంగల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Arrest of robbers who tried to rob an ATM in Sangareddy

జహీరాబాద్ : ఎటిఎంలో చోరీకి యత్నించిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ లో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఇండీక్యాష్ ఎటిఎంలో చోరీకి ప్రయత్నించి విఫలం అయ్యారు. అర్ధరాత్రి సమయంలో షట్టర్ ఎత్తి ఎటిఎంలోకి ప్రవేశించిన దుండగులు గునపంతో ఎటిఎం యంత్రం, సిసి కెమెరాలు ధ్వంసం చేశారు. షట్టర్  తెరిచి ఉండటంతో ఎటిఎంను పెట్రోలింగ్ పోలీసులు పరిశీలించారు. చోరీకి యత్నిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులను సంగారెడ్డి జిల్లా కోహీర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Arrest of robbers who tried to rob an ATM in Sangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News