- Advertisement -
హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్లుగా పనిచేసిన దంపతులు రామకృష్ణ, మౌనిక మీడియాతో మాట్లాడుతూ.. “ఇలాంటి సినిమాలకు పనిచేయడం అంత సులభం కాదు. మైత్రీ మూవీస్ వారు తప్ప ఈ సినిమాను ఎవరూ చేయలేరు. వారికి ఇది బిజినెస్ కన్నా ఫ్యాషనబుల్ జర్నీ. ఇక ఈ చిత్రం కోసం రెండు నెలల్లో 29 సెట్స్ వేశాం. ఈ సినిమాలో ఏది సెట్, ఏది కాదు అని ప్రేక్షకులు కనిపెట్టడం కష్టం. అంత నేచురల్గా సెట్స్ వేశాం. ‘పుష్ప’ ఓ విజువల్ ఫీస్ట్. మైత్రీ మూవీస్లో మాకు నాలుగవ చిత్రమిది”అని అన్నారు.
Art Director Ramakrishna couple about Pushpa
- Advertisement -