Friday, March 29, 2024

అవాస్తవికమైన విద్యావిధానం

- Advertisement -
- Advertisement -

Article About New Education Policy

34 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానం గతంలోని విధానాల వలెనే క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం, విధానంలో పేర్కొన్న ఉన్నత ఆశయాల అమలుకు అవసరమైన యంత్రాంగం రూపకల్పన పట్ల దృష్టి సారించడం జరిగిన్నట్లు కనబడటం లేదు.
భారత దేశంలో పాఠశాల విద్య దాదాపు శిథిలావస్థలో ఉన్నదని చెప్పక తప్పదు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు దారుణ పరిస్థితులలో ఉన్నాయి. అందుకు కారణాలను అన్వేషించి, ప్రత్యామ్నాయ విధానాలు అనుసరించే ప్రయత్నం చేయకుండా మన విద్యా వ్యవస్థలో మౌలిక సంస్కరణలు సాధ్యం కాదని గుర్తించాలి.
వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలలపై ప్రజాధనం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలు జాతీయ సగటు తీసుకొంటే రూ 40,000 వరకు ఉంది. జాతీయ తలసరి ఆదాయం కన్నా ఏడు రేట్లు ఎక్కువ. పైగా విద్యార్థులను ఆకట్టుకోవడం కోసం వారికి ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం, ఉచిత యూనిఫామ్, ఉచిత పాఠ్య గ్రంధాలు వంటి అనేక ఆకర్షణలు కల్పిస్తున్నది. అయినా దేశంలో సగం మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం లేదు.
నేడు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలు ఎందుకు ఉన్నాయో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా సింహావలోకనం చేసుకున్నాయా? దేశంలోని 7 లక్షల పాఠశాలలో 100 మందికన్నా తక్కువగా విద్యార్థులు ఉన్నారు. ఒక లక్ష పాఠశాలలో 20 మంది కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. కేవలం ఉపాధ్యాయుల ఉద్యోగాలు కాపాడటం కోసం పాఠశాలలను ప్రభుత్వం నడపాలా?
ప్రైవేట్ పాఠశాలలకన్నా అత్యధికంగా జీతాలు పొందుతున్నా ప్రభుత్వ ఉపాధ్యాయుల నాణ్యత ప్రమాణాలు దారుణంగా ఉంటున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే దేశంలో ప్రతి నలుగురు ఉపాధ్యాయులలో ప్రతి రోజు ఒకరు పాఠశాలకు హాజరు కావడం లేదు. హాజరైనా మరొకరు అసలు పాఠాలే చెప్పడం లేదు.
జీతాలు సరిగ్గాలేక వారు హాజరు కావడం లేదా? అందుకనే పాఠాలు చెప్పడం లేదా? దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా పని చేసిన ములాయం సింగ్ యాదవ్, మాయావతి వంటివారు ఉపాధ్యాయులుగా జీవితం ప్రారంభించిన వారే. ఉపాధ్యాయుల ఎంపిక చాల లోపభూయిష్టంగా ఉంటున్నది. రాజకీయ, అవినీతి కారణాలతో వారిని ఎన్నికల సమయంలో తమ ప్రచార బాధ్యతలు చేపట్టేవారుగానే రాజకీయ నాయకులు చూస్తున్నారు. ఉపాధ్యాయ పోస్ట్‌లను అమ్ముకున్నందుకు ఒక ముఖ్యమంత్రి జైలుకు వెళ్ళవలసి రావడం చూశాము.
గతంలో యుపి, బీహార్‌లలో ఉపాధ్యాయులకు అర్హత పరీక్షలు పెడితే 5వ తరగతి విద్యార్థుల గణిత గణాంకాలను సహితం సరిగ్గా రాయలేక పోయారు. కేవలం 10 శాతం ఉపాధ్యాయులు మాత్రమే అర్హత పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు.
నూతన విద్యావిధానంలో ఎంతసేపటికీ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల శిక్షణ వంటి అంశాలకు తప్పా పాఠశాల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఏ విధంగా తీసుకు రావాలో చర్చించిన దాఖలాలు కనబడటం లేదు.
సర్వ శిక్ష అభియాన్ క్రింద ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటు చేసి, పాఠశాల నిర్వహణలో వారి పాత్ర ఉండాలని నిర్ణయించినా, మొదట్లో కొంత ఉత్సాహం చూపినా ఆ తర్వాత అమలు పట్ల ఆసక్తి చూపడం లేదు. పాఠశాలల నిర్వహణ, పర్యవేక్షణ ప్రభుత్వంకు సాధ్యం కాదని 70 ఏళ్ళ అనుభవం వెల్లడి చేస్తున్నది.

గతంలో యుపి, బీహార్‌లలో ఉపాధ్యాయులకు అర్హత పరీక్షలు పెడితే 5వ తరగతి విద్యార్థుల గణిత గణాంకాలను సహితం సరిగ్గా రాయలేక పోయారు. కేవలం 10 శాతం ఉపాధ్యాయులు మాత్రమే అర్హత పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. నూతన విద్యావిధానంలో ఎంతసేపటికీ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల శిక్షణ వంటి అంశాలకు తప్పా పాఠశాల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఏ విధంగా తీసుకు రావాలో చర్చించిన దాఖలాలు కనబడటం లేదు. సర్వ శిక్ష అభియాన్ క్రింద ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటు చేసి, పాఠశాల నిర్వహణలో వారి పాత్ర ఉండాలని నిర్ణయించినా, మొదట్లో కొంత ఉత్సాహం చూపినా ఆ తర్వాత అమలు పట్ల ఆసక్తి చూపడం లేదు. పాఠశాలల నిర్వహణ, పర్యవేక్షణ ప్రభుత్వంకు సాధ్యం కాదని 70 ఏళ్ళ అనుభవం వెల్లడి చేస్తున్నది.

పౌరులకు పాఠశాల నిర్వహణలో క్రియాశీల పాత్ర కల్పించాలి. ప్రతి పాఠశాల ప్రాంతంలో పౌరుల కమిటీలు ఏర్పాటు చేసి, పాఠశాలల యాజమాన్యంలో వారి పర్యవేక్షణ ఉండేటట్లు చూడాలి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2011 నుండి 2018 వరకు దేశంలో 2.4 కోట్ల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను విడిచి ప్రైవేట్ పాఠశాలల్లో చేరారు. పేద ప్రజలు, మురికివాడలలో ఉండే ప్రజలు, అణగారిన వర్గాలు సహితం తాము సరిగ్గా తినకపోయినా తమ పిల్లలకు మంచి చదువు కోసం ప్రైవేట్ పాఠశాలకు పంపాలని ఆరాటపడటాన్ని మనం చూస్తున్నాము.
ప్రైవేట్ పాఠశాలలు అనగానే వాటిని దోపిడీ కేంద్రాలుగా చూడటం కూడా భావ్యం కాదు. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు ఉన్నప్పటికీ అత్యధికంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలు సాధారణమైనవే. ఒక అంచనా ప్రకారం 70 శాతం ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు రూ 1,000 మించి లేవు. 40 శాతం పాఠశాలల్లో అయితే రూ 500 మాత్రమే ఉంటున్నది.
భారత దేశంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల వ్యవస్థ ప్రపంచంలోనే మూడవ పెద్దది కావడం గమనార్హం. అయితే నేడు సుపరిపాలన అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావడంతో ఒక ప్రైవేట్ విద్యాలయం స్థాపించాలి అంటే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడవలసి వస్తున్నది. సుమారు 125 అనుమతులు పొందాలి. నిజాయితీతో ప్రైవేట్ పాఠశాలలు నడపలేని పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో మూడింట రెండు వంతుల మంది తక్కువ ఫీజులే చెల్లిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకన్నా విద్య ప్రమాణాలు ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపక్షంలో అన్ని ఉచితాలుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను కాదని తక్కువ ఆదాయ వర్గాలు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్పించడానికి అంత తెలివి తక్కువ వారా? ఈ సందర్భంగా ప్రముఖ రచయిత గురుచరణ్ దాస్ ఒక సూచన చేశారు. ప్రభుత్వ-ప్రైవేట్ పాఠశాలల మధ్య ఆరోగ్యకరమైన పోటీకి అవకాశం కల్పించడం ద్వారా విద్యా ప్రమాణాలు పెంచవచ్చని సూచించారు. ఐదేళ్ల వయస్సు వచ్చిన ప్రతి విద్యార్థికి ఒక ఉపకార వేతనం ఇచ్చి, తన ఇష్టం వచ్చిన పాఠశాలలో ఆ మొత్తంతో చేరి, చదువుకొనే అవకాశం ప్రభుత్వం కల్పించాలని అయన ప్రతిపాదించారు.
విద్యార్థులు చెల్లించే ఫీజుల నుండే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల జీతాలు చెల్లించాలి. విద్యార్థులు లేని పాఠశాలలను మూసివేయాలి. అప్పుడు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యాప్రమాణాలు పెంపు పట్ల దృష్టి సారిస్తారు. ప్రామాణికత గల పాఠశాలలే నిలదొక్కుకో గలుగుతాయి.
విద్య హక్కు చట్టం ప్రకారం కూడా ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలి. ఆ విధంగా పేదలకు నాణ్యమైన చదువు అందేటట్లు ఈ నిబంధన పారదర్శకంగా అమలయ్యేటట్లు చూడాలి.
ప్రభుత్వం రాజకీయ సంసిద్ధత కనబరిస్తే ప్రభుత్వ పాఠశాలలో ప్రమాణాలను మెరుగు పరచడం సాధ్యం కాగలదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిరూపించారు. అటువంటి పట్టుదలతో మరే ముఖ్యమంత్రి గత 70 ఏళ్లుగా భారత దేశంలో చేయలేదు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలి.
ప్రభుత్వం ఉపాధ్యాయుల జీతాలపై కాకుండా విద్యార్థుల చదువులకోసం ప్రజాధనం ఖర్చు చేసే సరికొత్త విధానం తీసుకు రావాలి. ఇంటర్ నెట్, ఇతర సమాచార సాధనాల ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల బోధనారీతులను విద్యార్థులు, తల్లిదండ్రులు తెలుసుకొని తమకు ఇష్టమైన పాఠశాలలో చేరే అవకాశం కల్పించాలి. మొత్తం విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకు రావలసిన అవసరం ఉంది.

Article About New Education Policy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News