Friday, April 19, 2024

నేడు హైదరాబాద్‌కు ఢిల్లీ సిఎం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై ఢిల్లీ సి ఎం కేజ్రీవాల్ విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో ఆయన శనివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఈ మేరకు ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. ఈ అంశంపై ఇప్పటికే పలువురు విపక్ష నేతలను ఆయన కలిశారు. దేశ రాజధాని పరిధి ఢిల్లీలో గ్రూప్ ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకు గాను కేంద్ర ప్రభు త్వం ఈ నెల 19వ తేదీన ప్రత్యేక
ఆర్డినెన్స్‌ను జారీ చేసింది.

సంబంధిత ఉద్యోగుల విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి జాతీయ రాజధాని సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఢిల్లీ ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం ఉద్యోగుల బదిలీలు, నియామకాలు జరుగుతాయని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును అమలు పరచాల్సిందేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మంత్రులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఆర్డినెన్స్ ద్వారా అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కేజ్రీవాల్ ట్వీట్ కూడా చేశారు.

ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ పలువురు నేతలను కలిశారు.ఈ ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌లో వ్యతిరేకించాలని విపక్షాలను కేజ్రీవాల్ కోరుతున్నారు. ఈ విషయమై కేజ్రీవాల్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరేలతో కలిసి చర్చించారు. ఈ క్రమంలోనే శనివారం సిఎం కెసిఆర్‌తో భేటీ కానున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News